ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి… కేసులు గత కొంత కాలం నుంచి తగ్గుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులిటెన్ ప్రకారం..
ఏపీలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా… కేవలం 156 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారించబడింది. అలాగే ఈ కరోనా మహమ్మారి కారణంగా కృష్ణ, నెల్లూరు మరియు విశాఖపట్నం లలో ఒక్కొక్కరూ మరణించారు.